పవార్ కు పడింది...!

న్యూఢిల్లీ,నవంబర్ 24: : కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌పై ఓ యువకుడు గురువారం దాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఎండీసీ కార్యక్రమంలో హరవిందర్‌సింగ్ అనే యువకుడు పవార్‌ను చెంపదెబ్బ కొట్టాడు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా పవార్‌పై అతడు చేయిచేసుకున్నాడు. లంచం కేసులో శిక్ష పడిన టెలికం మాజీ మంత్రి సుఖ్‌రాంపై కూడా హర్విందర్‌సింగ్  గత వారం దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు