లోక్ సభలో తెలంగాణపై వాయిదా తీర్మానం :

రెండో రోజూ సాగని సభలు 
న్యూఢిల్లీ ,నవంబర్ 23:  టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం లోక్ సభలో తెలంగాణపై వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 700మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాటిపై చర్చించాలని ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం ప్రారంభమైన కొద్ది నిమషాల్లోనే వాయిదా పడ్డాయి. లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సభ్యుల నిరసనతో సభలో గందరగోళం నెలకొంది. దాంతో సభను స్పీకర్ మీరాకుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగటంతో సభ వాయిదా పడింది. వాయిదా తర్వాత ప్రారంభమైన ఉభయ సభలు తెలంగాణ నినాదాలతో హోరెత్తడంతో గురువారానికి వాయిదా పడ్డాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు