కిరణ్ కు ' జై ' సుధ...!

హైదరాబాద్,నవంబర్ 18:  కాంగ్రెసు సికింద్రబాద్ శాసనసభ్యురాలు జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై కొట్టేసి  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ఇచ్చినందున వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నట్టు  ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన జయసుధ  ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.  శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయిన  తర్వాత జయసుధ మీడియా తో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డిపై  ప్రశంసల  జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రి పనితీరు బాగుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిని తన నియోజకవర్గానికి అహ్వానిస్తానని ఆమె చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు వరమని ఆమె కొనియాడారు.  వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి సమర్థంగా అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు