Sunday, November 13, 2011

భారతీయ పర్యాటకులకు వీసాచార్జీలను తగ్గించిన శ్రీలంక

కొలంబో,నవంబర్ 14:  భారతీయ పర్యాటకులకు  వీసా చార్జీలను శ్రీలంక తగ్గించింది. శ్రీలంకలో పర్యటించే భారతీయుల నుంచి కేవలం 10 డాలర్లు మాత్రమే వీసాల చార్జీల కింద వసూలు చేస్తారు. అన్ని సార్క్ దేశాలకు ఇది వర్తిస్తుంది. గతంలో 50 డాలర్లు వసూలు చేయాలని భావించినా భారత్ చొరవతో దీన్ని కుదించింది. భారతీయేతరులతోపాటు , నాన్ సార్క్ దేశాలకు చెందిన వారు 20 డాలర్లు చెల్లించాలి.
శ్రీలంకను అత్యధికంగా సందర్శించే పర్యటకుల జాబితాలో బ్రిటన్ స్థానాన్ని తాజాగా భారత్ ఆక్రమించింది. శ్రీలంకకు వెళ్లే భారతీయుల శాతం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో రేట్లను తగ్గించాలని భారత్ కోరింది. మాల్దీవులు, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఈటీఏ, ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఎల్టీటీఈతో చిరకాల యుద్ధానికి తెర పడటంతో పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక చర్యలు తీసుకుంటోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...