గాలి జనార్థన్ రెడ్డి రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్,నవంబర్ 14: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రిమాండ్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 28వ తేదీ వరకూ పొడిగించింది. ఈ కేసులో వీరి రిమాండ్ గడువు సోమవారం తో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్థన్ రెడ్డి న్యాయమూర్తిని అభ్యర్థించారు. తాను ఏ తప్పూ చేయలేదని; తాను జైల్లో ఉండడం వలన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించారు. అయితే న్యాయమూర్తి ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.
Comments