Monday, November 14, 2011

గాలి జనార్థన్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్,నవంబర్ 14:  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల  28వ తేదీ వరకూ పొడిగించింది. ఈ కేసులో వీరి రిమాండ్ గడువు సోమవారం తో ముగియడంతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్థన్ రెడ్డి న్యాయమూర్తిని అభ్యర్థించారు. తాను ఏ తప్పూ చేయలేదని; తాను జైల్లో ఉండడం వలన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించారు. అయితే న్యాయమూర్తి ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...