గాలి జనార్థన్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్,నవంబర్ 14:  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల  28వ తేదీ వరకూ పొడిగించింది. ఈ కేసులో వీరి రిమాండ్ గడువు సోమవారం తో ముగియడంతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్థన్ రెడ్డి న్యాయమూర్తిని అభ్యర్థించారు. తాను ఏ తప్పూ చేయలేదని; తాను జైల్లో ఉండడం వలన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించారు. అయితే న్యాయమూర్తి ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు