Saturday, November 12, 2011

వైట్ హౌస్ వద్ద కాల్పులు

వాషింగ్టన్,నవంబర్ 12:  వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సమీపంలో శుక్రవారం కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి రూస్ వెల్ట్ బ్రిడ్జి మీదుగా పరిగెత్తినట్లు చెబుతున్నారు.  ఈ సంఘటనతో వాషింగ్టన్ డీసీ మార్గంలో సెక్యూరిటీని మరింత పెంచారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఆ కాల్పులు శ్వేతసౌధాన్ని గురిపెట్టి జరిగాయని చెప్పడానికి ఆధారాలు లెవని అధికారులు అంటున్నారు. పశ్చిమ దిశగా రెండు వాహనాలు వెళ్లినట్లు కూడా వారు గుర్తించారు. కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కాలిఫోర్నియాలో ఉన్నారు. .

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...