Sunday, November 13, 2011

కలాం కు సారీ చెప్పిన అమెరికా

న్యూఢిల్లీ,నవంబర్ 14: భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్‌కలాంను అమెరికా ఆదివారం క్షమాపణ కోరిందని ఇక్కడి యూఎస్ రాయబార  కార్యాలయం  వెల్లడించింది. ఈ మేరకు యూఎస్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరీటి అడ్మినిస్ట్రేటర్ నుంచి అబ్దుల్ కలాంకు వ్యక్తిగతంగా లేఖను అందజేసినట్లు పేర్కొంది. ఇటువంటి ఘటన మరో సారి పునరావృతం కాకుండా ఉండేలా పటి ష్టమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వానికి మరో లేఖ ద్వారా వివరించింది. కాగా  కలాంకు జరిగిన తాజా అవమానంపై భారత్  తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆమోదయోగ్యం కాని చర్యలకు తెరదించకపోతే అమెరికా ప్రముఖులపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అంశంపై విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ అమెరికాలోని భారత రాయబారి నిరుపమా రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. సెప్టెంబర్ 29న న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కాలాంను భద్రతా సిబ్బంది తనిఖి చేసిన సంఘటన  తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...