Saturday, November 5, 2011

తెలంగాణ మేమే ఇస్తాం: సుష్మా స్వరాజ్

నల్గొండ, నవంబర్ 6: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తప్ప మరిదేన్నీ అంగీకరించరాదని, మరే   ప్రత్యామ్నాయానికైనా  అంగీకరిస్తే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్నారు.  బీజేపీ రాష్ట్ర శాఖ నల్లగొండలో నిర్వహించిన ‘బీజేపీ తెలంగాణ పోరు’ సభలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం  బలిదానాలకు పాల్పడవద్దని, భావి తెలంగాణ కోసం బతికి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఇస్తుందని హామీ ఇచ్చారు.
చిన్న రాష్ట్రాలలో అభివృద్ది లేదనే వాదన సరికాదని, ఎన్డీయే ప్రభుత్వం గతంలో మూడు రాష్ట్రాలిస్తే ఇప్పుడవన్నీ సుభిక్షంగా ఉన్నాయని సుష్మా తెలిపారు. తెలంగాణకు మద్దతిస్తున్నామంటే అది ఆంధ్రాకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...