Tuesday, November 1, 2011

ఇదేనా బాబు మనసులో మాట...!

హైదరాబాద్ ,నవంబర్ 1:   తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు దేశ రాజధాని హస్తినలో  స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారం రోజుల సత్యాగ్రహానికి మద్దతు ఇస్తుంటే, మరో పక్క వారి అధినేత  హైదరాబాదులో రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో తెలంగాణ ఏర్పాటు ను వ్యతిరేకించే విధంగా మాట్లాడి సంచలనం రేపారు.ఆంధ్రప్రదేశ్ అవతరణకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం చేశారని ,తెలుగుజాతి మూడు వేల ఏళ్ల పాటు కలిసి ఉందని, 150 ఏళ్లు మాత్రమే విడిపోయి ఉందని చంద్రబాబు ఈ సందర్భం గా అన్నారు. ఈ వ్యాఖ్యలు బాబు  తెలంగాణ వ్యతిరేక వైఖరిని చెప్పకనే చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు భాష్యం చెబుతున్నారు. మరోవైపు ఆయన బావమరిది, తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ నేరుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడి కలకలం రేపారు. రాష్ట్రం విడిపోకుండా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బాలకృష్ణ ఓ కార్యక్రమంలో అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, దాన్ని విడగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తూ , తెలంగాణ రాష్ట్ర సమితి ని, కాంగ్రెసును ఎండగట్టాలనే తమ లక్ష్యాన్ని సాధించడం మాట అటుంచి, బావా మరదుల వ్యాఖ్యలతో ఖంగు తినాల్సి వచ్చింది. కాంగ్రెసు, తెరాస నాయకులు ఇంత కాలం తెలుగుదేశం తెలంగాణ నేతలపై చేస్తు న్న వ్యతిరేక వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...