Tuesday, November 1, 2011

నల్గొండలో ఆమరణ దీక్ష ప్రారంభించిన కోమటిరెడ్డి

నల్గొండ,నవంబర్ 1:  తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నది సీమాంధ్రులు  కాదని... తెలంగాణ మంత్రులేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో నల్గొండ పట్టణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఆమరణ దీక్షను ప్రారంభించారు.విజయమో.. వీర స్వర్గమో ఈ దీక్ష ద్వారానే తేల్చుకుంటానని ఆయన అన్నారు.  సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు ఒక్కటై  బలం చాటారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్నిపార్టీలు ఒక్కటి కాకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేకే,రాజయ్య, మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరై కోమటిరెడ్డికి సంఘీభావం తెలిపారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఈ దీక్షకు తరలి వచ్చారు.
ఢిల్లీలో దీక్ష చేపట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ
న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష వారంపాటు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. అంతకు ముందు ఆయన గాంధీజీ సమాధి స్థలం రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అక్కడే గంటపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం చేశారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...