సత్యసాయి బాబా 86వ జయంతి వేడుకలు

పుట్టపర్తి,నవంబర్ 23: పుట్టపర్తిలో సత్యసాయి బాబా 86వ జయంతి వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో బాబా మహా సమాధి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మల్లాది సోదరులు రూపొందించిన బాబా భక్తి గీతాలు 'హృదయవీణ' సీడీని ఆవిష్కరించారు. సత్యసాయి జయంతి వేడుకలకు రాష్ట్ర మంత్రులు గీతారడ్డి, రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి హాజరయ్యారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు