Thursday, November 24, 2011

సచిన్ అర్థ సెంచరీ; భారత్ 281/3

ముంబై,నవంబర్ 24: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. సచిన్(67), లక్ష్మణ్(32) క్రీజ్‌లో ఉన్నారు. ద్రవిడ్ 82, గంభీర్ 55, సెహ్వాగ్ 37 పరుగులు చేసి అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్, సమీ, శ్యామూల్స్ తలో వికెట్ తీశారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 590 పరుగులకు ఆలౌటయింది.
ద్రవిడ్ ఖాతాలో మరో రికార్డు

మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ ద్రవిడ్ 13వేల పరుగులు పూర్తి చేశాడు. సచిన్ తర్వాత అత్యథిక పరుగులు చేసిన ఆటగాడుగా ద్రవిడ్ రెండోస్థానంలో నిలిచాడు. ఆతర్వాత స్థానంలో పాంటింగ్, కలీస్ ఉన్నారు. 1996లో ద్రవిడ్ ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడగా, ఇప్పటి వరకూ 160 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతని కెరీర్ లో 36 సెంచరీలు కూడా ఉన్నాయి

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...