Thursday, November 17, 2011

2-0 తో సిరీస్ గెలిచిన భారత్

కోల్ కతా,నవంబర్ 17:  :  భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య  ఈడెన్ గార్డెన్స్ లో  జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్- 15 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 463 పరుగులకు ఆలౌట్ కావటంతో విజయం భారత్ ను వరించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా హైదరాబాదీ ఆటగాడు లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లు, ఇషాంత్ శర్మ, అశ్విన్, ఓజాలు చెరో రెండు వికెట్లు తీశారు. 22వ తేదీ నుంచి ముంబయిలో మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
యువరాజ్‌కు ఉద్వాసన
కాగా, భారత టెస్ట్ జట్టు నుంచి  యువరాజ్ స్థానంలో రోహిత్ శర్మను జట్టులోకి ఎంపిక చేశారు.  22 తేదిన ముంబైలో ప్రారంభమయ్యే మూడవ టెస్ట్, చివరి టెస్ట్ లకు భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువ బౌలర్లు అశ్విన్, ఓజాలు రాణిస్తుండటంతో హర్భజన్ సింగ్‌కు చోటు దక్కలేదు. జట్టు: మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, ఆర్ అశ్విన్, ఓజా, ఉమేష్ యాదవ్, విరాట్ కోహ్లీ, రహానే, రాహుల్ శర్మ, వరుణ్ ఆరోణ్

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...