Sunday, November 20, 2011

అగ్నిప్రమాదంలో 14 మంది హిజ్రాల మృతి

న్యూఢిల్లీ,నవంబర్ 21:   దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నందనగరిలోని కమ్యూనిటీ సెంటర్‌లో హిజ్రాల సమావేశంలో అకస్మాత్తుగా ఎగసిపడిన మంటల్లో 14 మంది హిజ్రాలు మరణించగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. నందనగరి కమ్యూనిటీ కేంద్రంలో ఈనెల 18 నుంచి హిజ్రాలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా 2,500 మంది హిజ్రాలు హాజరైన సమావేశాల కోసం కమ్యూనిటీ సెంటర్‌లో భారీ టెంట్లు నిర్మించారు. వంట గదిలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ వైర్లు, టెంట్లు అంటుకుని మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. వంట కోసం తెచ్చుకున్న రెండు సిలిండర్లు పేలడంతో మంటలు క్షణంలో వ్యాపించాయి. బయటకు వెళ్లేందుకు ఒకేఒక్క మార్గం ఉండటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది.  మంటల్లో చిక్కుకుని 14 మంది మరణించారు. 12 మంది మృతదేహాలను బయటికి తీశారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. 17 అగ్నిమాపక యంత్రాలు, 40 మంది సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈనెల 14 నుంచి శనివారం వరకూ ఘజియాబాద్‌లో సమావేశాలు నిర్వహించుకున్న హిజ్రాలు, శనివారం సమావేశ స్థలాన్ని నందనగరి కమ్యూనిటీ సెంటర్‌కు మార్చారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...