Tuesday, November 15, 2011

12మంది ఎంపీల రాజీనామాలు తిరస్కృతి

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా పెండింగ్‌
న్యూఢిల్లీ,నవంబర్ 16: ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పలు పార్టీలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు చేసిన రాజీనామాల్లో ఒక్కటి మినహా అన్నింటినీ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం తిరస్కరించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాను పెండింగ్‌లో ఉంచి, మిగతా 12 రాజీనామాలనూ స్పీకర్ తోసిపుచ్చారని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. రాజీనామాలు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం తదితర కారణాల వల్ల వాటిని తోసిపుచ్చారని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ), మధు యాష్కీ గౌడ్ (నిజామాబాద్), మంద జగన్నాథ్ (నాగర్‌కర్నూల్), బలరాం నాయక్ (మహబూబాబాద్), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), జి.వివేక్ (పెద్దపల్లి),సరిసిల్ల రాజయ్య (వరంగల్); టీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ (మహబూబ్‌నగర్), విజయశాంతి (మెదక్); టీడీపీ నుంచి నా మా నాగేశ్వరరావు (ఖమ్మం), రమేశ్ రాథోడ్ (ఆదిలాబాద్)ల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. కోమటిరెడ్డితో పాటు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన రాజీనామాను కూడా స్పీకర్ పెండింగ్‌లో పెట్టారని లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...