హైదరాబాద్,సెప్టెంబర్ 14: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తమ సిబిఐ కస్టడీని సవాల్ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. కాగా వీరిద్దరూ బుధవారం కోఠిలోని సిబిఐ కార్యాలయంలో సిబిఐ అధికారుల విచారణకు హాజరయ్యారు. గాలి తరఫు న్యాయవాదుల సమక్షంలో అధికారులు వారిని విచారించారు. మూడు రోజుల పాటు సిబిఐ, గాలి జనార్ధన్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలు విన్న నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ నెల 19 వరకు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వు ఇచ్చింది. మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి శ్రీవారికి బహూకరించిన బంగారు కిరీటం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment