Friday, September 23, 2011

పటౌడీ కన్నుమూత

కుటుంబ సభ్యులతో పటౌడీ
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 23:  భారత అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్లలో ఒకరైన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (70) గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక గంగారామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన తుదిశ్వాస విడిచే సమయానికి భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీ ఖాన్, కూతుళ్లు సోహా, సాబాలు చెంతనే ఉన్నారు. భారత క్రికెట్‌ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన క్రికెటర్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ. తాను ఆడిన 46 టెస్టుల్లో 40 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించారు. భారత్‌కు విదేశాల్లో తొలిసారి సిరీస్ విజయాన్ని అందించారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన కొద్ది రోజులకే కారు ప్రమాదంలో కుడి కంటి చూపు కోల్పోయారు. కానీ  దృఢ సంకల్పంతో  ఏదైనా సాధ్యమే అని పటౌడీ నిరూపించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...