హైదరాబాద్, సెప్టెంబర్ 20: సకల జనుల సమ్మెను నిలిపి వేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్ ) లో ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్రావుకు, టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నానికి చెందిన నారాయణ అనే వ్యక్తి సకల జనుల సమ్మెను నిలిపి వేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సమ్మె వల్ల ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా నిలిచి పోయాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ కక్రు, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అయితే నోటీసులకు సమాధానం ఇవ్వడానికి వారికి వారం గడువివ్వడమే విడ్డూరం. పరిస్థితి తీవ్రత పై వేగం గా స్పందించే స్థితిలో న్యాయవ్యవస్థ లేదనడానికి ఇదే నిదర్శనం. ప్రజా ప్రయోజనాలు ఏ వ్యవస్థకూ పట్టని దౌర్భాగ్య అవస్థలో ఉన్నాం మనం...
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment