సాకారం కాని తీస్తా నదీ జలాల ఒప్పందం
ఢాకా,సెప్టెంబర్ 7: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యకు తెరదించుతూ భారత్, బంగ్లాదేశ్ల చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రెండు రోజుల బంగ్లా పర్యటన కోసం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఆ దేశ రాజధాని ఢాకా చేరుకున్నారు. పర్యటన సందర్భంగా ఇరు దేశాలు భూ సరిహద్దు గుర్తింపు, స్వదేశీ భూభాగాల ( ఎన్క్లేవ్) మార్పిడి తో సహా పది ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే కీలకమైన తీస్తా నదీ జలాల ఒప్పందంపై అంగీకారం కుదరలేదు. తీస్తా నదీ జలాల ఒప్పందం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం కారణంగా సాకారం కాలేదు.అయితే తీస్తాతోపాటు ఫెనీ నదీ జాలలను పంచుకోవడంపై పరస్పర ఆమోదయోగ్య, పారదర్శక ఒప్పందం కోసం చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయని మన్మోహన్ చెప్పారు. బంగ్లా నుంచి 46 వస్త్ర ఉత్పత్తులు సహా 61 వస్తువులను సుంకం లేకుండా భారత్ మార్కెట్లోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తీన్ భిగా కారిడార్ గుండా బంగ్లాదేశీయులను రోజుకు 24 గంటలూ భారత్లోకి అనుమతిస్తామన్నారు. ఎన్క్లేవ్ మార్పిడి ఒప్పందం కింద బంగ్లాలోని 111 భారత ఎన్క్లేవ్లు, అలాగే భారత్లోని 51 ఎన్క్లేవ్లను ఇచ్చిపుచ్చుకోనున్నారు. 1974 తర్వాత భారత్ తన భూభాగంలో కొంత భాగాన్ని వేరే దేశానికి అప్పగించనుండడం ఇది రెండోసారి.
ఢాకా,సెప్టెంబర్ 7: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యకు తెరదించుతూ భారత్, బంగ్లాదేశ్ల చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రెండు రోజుల బంగ్లా పర్యటన కోసం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఆ దేశ రాజధాని ఢాకా చేరుకున్నారు. పర్యటన సందర్భంగా ఇరు దేశాలు భూ సరిహద్దు గుర్తింపు, స్వదేశీ భూభాగాల ( ఎన్క్లేవ్) మార్పిడి తో సహా పది ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే కీలకమైన తీస్తా నదీ జలాల ఒప్పందంపై అంగీకారం కుదరలేదు. తీస్తా నదీ జలాల ఒప్పందం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం కారణంగా సాకారం కాలేదు.అయితే తీస్తాతోపాటు ఫెనీ నదీ జాలలను పంచుకోవడంపై పరస్పర ఆమోదయోగ్య, పారదర్శక ఒప్పందం కోసం చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయని మన్మోహన్ చెప్పారు. బంగ్లా నుంచి 46 వస్త్ర ఉత్పత్తులు సహా 61 వస్తువులను సుంకం లేకుండా భారత్ మార్కెట్లోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తీన్ భిగా కారిడార్ గుండా బంగ్లాదేశీయులను రోజుకు 24 గంటలూ భారత్లోకి అనుమతిస్తామన్నారు. ఎన్క్లేవ్ మార్పిడి ఒప్పందం కింద బంగ్లాలోని 111 భారత ఎన్క్లేవ్లు, అలాగే భారత్లోని 51 ఎన్క్లేవ్లను ఇచ్చిపుచ్చుకోనున్నారు. 1974 తర్వాత భారత్ తన భూభాగంలో కొంత భాగాన్ని వేరే దేశానికి అప్పగించనుండడం ఇది రెండోసారి.
No comments:
Post a Comment