Thursday, September 15, 2011

ఊసరవెల్లి ’ఆడియో విడుదల

దేవీశ్రీ తో కలసి స్టెప్పేస్తున్న ఎన్ టీ ఆర్ 
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘ఊసరవెల్లి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు.ఈ వేడుకలో రాజమౌళి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, హరీష్‌శంకర్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, డి.సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, కె. అచ్చిరెడ్డి, నల్లమలుపు శ్రీనివాస్, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, సురేష్‌రెడ్డి, గణేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి టాకీ విడుదలైన ఈ రోజున ఆడియో వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉందని,  ఈ సినిమా సిక్సర్ కాదు... బౌండరీ దాటి, స్టేడియం దాటి బయటపడుతుందని అన్నారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...