హైదరాబాద్,సెప్టెంబర్ 3: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ (91) శనివారం కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితం కేర్ ఆస్పత్రిలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హరిశ్చంద్రప్రసాద్ స్వస్థలం. 1921 జూలై 8న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన పిన్నవయసులోనే పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా ఎదిగారు. 1947లో తణుకులో ఆంధ్రా షుగర్స్ స్థాపించారు. తణుకు పట్టణానికి తొలి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తణుకులో పాలిటెక్నిక్ కాలేజీ, కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాలతో పాటు జిల్లా, ఇతర ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment