'లీ' పెను తుపాను గుప్పెట్లో లూసియానా, మిసిసిపి

మియామీ, సెప్టెంబర్ 5:  పెను తుపాను 'లీ' అమెరికాలోని తీరప్రాంత రాష్ట్రాలను కుదిపేస్తోంది. కుండపోత వర్షాలతో ఆయా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఫలితంగా కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తవచ్చని అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, పెను తుపాను ఆదివారం ఉదయం లూసియానాలో తీరాన్ని తాకడంతో కుండపోత వర్షాలతో లూసియానా జలమయమైంది. లూసియానా, మిసిసిపిల్లోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ బాబీ జిందాల్ ప్రకటించారు. మిసిపిపిలోనూ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు అక్కడి గవర్నర్ స్పష్టం చేశారు. తుపాను కారణంగా 60 శాతం చమురు ఉత్పత్తి, 55 శాతం సహజవాయువు ఉత్పత్తి నిలిచిపోయింది. తీర ప్రాంతంలోని డెస్టిన్, ఫ్లోరిడా, వెస్ట్‌వార్డ్ నుంచి సబీనా పాస్ వరకు, టెక్సాస్ల్లో తుపాను హెచ్చరికలు జారీ  చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు