గవర్నర్ పాలనే శరణ్యమా...?
హైదరాబాద్ ,సెప్టెంబర్ 18: సకల జనుల సమ్మె తీవ్రమవుతోంది. . ఇది ఎలా పరిష్కారమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విరమించండనే అప్పీళ్ళు, చర్యలు తీసుకుంటామని నిస్సహాయ హెచ్చరికలు తప్పితే సీరియస్ గా ఉన్నట్టు కనిపించడం లేదు. కొన్ని శాఖలను ఎస్మా పరిధిలోకి తెచ్చినా ఫలితం సున్న. ఈ ఆరు రోజులలో సకల జనుల సమ్మెలోకి ఒక్కో విభాగం వచ్చి చేరుతోంది. సోమవారం నుంచి సకల జనుల సమ్మెలో తామూ భాగస్వాములమవుతున్నామని... ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోతాయని ఎన్ఎంయూ తెలంగాణ ఫోరం ప్రకటించింది. మరో వైపు సోమవారం తెలంగాణలోని జాతీయ రహదారుల దిగ్బంధానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఇటు పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు తాము కూడా సమ్మెకు వెడతామని ప్రకటించారు. సుమారు 1.90 లక్షల మందిదాకా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఐకేపీ, ఎన్ఎంఆర్, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం నుంచి సమ్మెలో ఇగుతామంటున్నారు. ఉపాధ్యాయలోకం ఇప్పటికే సమ్మెలో చేరింది. పరీక్షలన్ని వాయిదా పడ్డాయి. సింగరేణి లో సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయి విద్యుత్ సరఫరా మిణుకు మిణుకు మంటోంది. డిసెంబర్ 9 న సన్నాసి ప్రకటన చేసి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్న కేంద్రం ఇక అంతిమం గా గవర్నర్ పాలన కే మొగ్గు చూపుతున్నట్టు ఢిల్లీ వర్గాల భోగట్టా.
Comments