హైదరాబాద్ ,సెప్టెంబర్ 29: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. నిషేదాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణపై పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హ్యాకర్ల ర్యాలీ నేపథ్యంలో ఆయన అరెస్టు జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తలపెట్టిన సకల జనుల సమ్మెకు మద్దతుగా హైదరాబాదు, సికింద్రాబాద్ జంటనగరాల హ్యాకర్లు గురువారం వార్తాపత్రికలను పంపిణీ చేయలేదు. దీంతో జంటనగరాల్లోని ఇళ్లకు వార్తాపత్రికలు పూర్తిగా బందయ్యాయి.హ్యాకర్లు గురువారం ఉదయమే సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ నుంచి హైదరాబాదులోని క్లాక్ టవర్ వరకు ర్యాలీ తలపెట్టారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. హ్యాకర్లను అరెస్టు చేశారు. వారి అరెస్టును నిరసిస్తూ కోదండరామ్ క్లాక్ టవర్ వద్ద బైఠాయింపు జరిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హ్యాకర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నాకు దిగారు. పోలీసులు హ్యాకర్లను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణలో ప్రజాస్వామిక ఉద్యమాలను కూడా అనుమతించడం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని కూడా అనుమతించకపోవడాన్ని ఆయన వ్యతిరేకించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment