Saturday, September 10, 2011

గాలి జనార్దన్ రెడ్డి వజ్రకిరీటాన్ని తిరిగి ఇవ్వం: టి.టి.డి.

హైదరాబాద్ ,సెప్టెంబర్ 10:  తిరుమల శ్రీవారికి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రదానం చేసిన 45 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రకిరీటాన్ని తిరిగి ఇచ్చేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం గాలి జనార్దన్ రెడ్డి ఆ కిరీటాన్ని ప్రదానం చేశారు. అవినీతికి పాల్పడిన గాలి జనార్దన్ రెడ్డి ప్రదానం చేసిన వజ్ర కిరీటాన్ని వాపసు చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టిటిడి కార్యనిర్వాక అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలోనూ వజ్ర కిరీటాన్ని వాపసు చేసేది లేదని ఆయన ఓ వార్తా సంస్థతో చెప్పారు. ఆ కిరీటాన్ని పరిశీలించడానికి ఆదాయం పన్ను శాఖ అధికారులు లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల అధికారులు ఎవరు వచ్చినా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...