Monday, September 26, 2011

ఐటీ ఉద్యోగులకూ సమ్మె సెగ

హైదరాబాద్,సెప్టెంబర్ 26:  సకల జనుల సమ్మె ప్రభావం తాజాగా ఐటీ ఉద్యోగులను  తాకింది. తెలంగాణకు మద్దతుగా విధులకు హాజరు కావద్దంటు జెఎన్టీయూ జేఏసీ నేతలు సోమవారం ఐటీ ఉద్యోగులను అడ్డుకున్నారు. హైటెక్ సిటీకి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధం చేసి విధులకు వెళ్లవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాల చేశారు. దాంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగులను అడ్డుకోవటంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగ, విధులకు వెళుతున్న సచివాలయ ఉద్యోగులను సోమవారం ఉదయంఎన్జీవో కాలనీ వద్ద తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సచివాలయం వెళుతున్న ఆర్టీసీ బస్సులను తెలంగాణవాదులు వనస్థలిపురం వద్ద అడ్డుకున్నారు. రెండు బస్సుల అద్దాలను పగులగొట్టారు. దాంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...