కాంగ్రెస్ లో తెలంగాణా చీలిక...?
హైదరాబాద్,సెప్టెంబర్ 25: కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికే ఆ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో కాంగ్రెస్ను వీడటంతో పాటు ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ’(టీసీపీ) పేరుతో ఏకంగా కొత్తగా పార్టీని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించినట్టు చెబుతున్నారు. కొత్తపార్టీలో చేరబోయే వారి జాబితాలోమంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్యలతో పాటు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.
Comments