Saturday, September 24, 2011

తెలంగాణలో పూర్తిగా స్తంభించిన రవాణా వ్యవస్థ

హైదరాబాద్,సెప్టెంబర్ 24: : తెలంగాణలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. శనివారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకలు కూడా స్తంభించాయి. బస్సులు, ఆటోలతో పాటు రైళ్లు కూడా ఆగిపోవడంతో రవాణాకు పూర్తి అంతరాయం కలుగుతోంది. తెలంగాణ జెఎసి ఇచ్చిన పిలువు మేరకు శనివారం ఉదయం  48 గంటల రైల్ రోకో కార్యక్రమం ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి నడవాల్సిన 55 ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 22 ప్యాసింజర్ రైళ్లను ముందు జాగ్రత్త చర్యగా ఆపేసింది. మరో 55 రైళ్లను దారి మళ్లించారు. సికింద్రబాదు వరకు రావాల్సిన రైళ్లను విజయవాడలోనే ఆపేశారు.  తెలంగాణవాదులు శనివారం ఉదయమే రైలు పట్టాల మీదికి వచ్చారు. సికింద్రాబాదు, కాజీపేట, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ఆటోలు కూడా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణలో బస్సులు నడవడం లేదు. పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తున్నాయి. మద్యం షాపులను కూడా తెరవ లేదు. కాగా, తెలంగాణలో సకల జనుల సమ్మె శనివారంనాడు 12వ రోజుకు చేరుకుంది. రైల్ రోకోను విజయంవంతం చేయడానికి ఆందోళనకారులు పట్టాలపైనే వంటావార్పూ పెట్టారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...