తిరుపతి, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని 2 కోట్ల 25 లక్షల తెల్ల రేషన్కార్డుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబరు 1వ తేదీ నుంచి కిలో బియ్యం ఒక్క రూపాయికే పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిని కట్టడి చేయడం కోసం నవంబరు 1వ తేదీ నుంచి 25 రకాల సర్టిఫికెట్లు ఈ సేవా కేంద్రాల నుంచి పది నిమిషాల్లోనే అందించే వ్యవస్థను అమలు చేయనున్నట్టు సీఎం తెలిపారు. తిరుపతి లో బుధవారం రైతు, మహిళా సదస్సులో సీఎం మాట్లాడారు.మహిళల కోసం ప్రతి ఆర్నెల్లకో కొత్త పథకం ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి 5 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని, డిసెంబర్లో ఒకే రోజు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని పునరుద్ఘాటించారు. అక్టోబర్ 2వ తేదీన ఇందిర జలప్రభ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాలకు డ్రిప్, బోర్ల ద్వారా సాగునీరందించే పథకం చేపడతామన్నారు. రాష్ట్రంలో గర్భిణులకు పౌష్టికాహారం అందించడం కోసం మహిళా సంఘాల నేతృత్వంలో 38 వేల పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment