హైదరాబాద్,సెప్టెంబర్ 21: నగరంలోని యూసఫ్ గూడ కృష్ణానగర్ వద్ద బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బస్సు బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. సకల జనుల సమ్మె ప్రభావంతో పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. అయితే డ్రైవర్ కు సరైన అవగాహన లేకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతి చెందిన ఆటో డ్రైవర్ మల్లేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అలాగే కుటుంబంలోని ఒకరికి ఉద్యోగంతో పాటు, గ్రేటర్ కాంగ్రెస్ తరపున మరో రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి దానం నాగేందర్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వం పట్టుదలకు పోయి బస్సులను అనుభవంలేని వారితో నడిపించటం వల్లే ఓ అమాయక ప్రాణం బలైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.ఈ ఘటనకు ప్రభుత్వంతో పాటు, ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడినవారికి ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం అందించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుదల వీడాలని, లేకుంటే బస్సులు తిరిగి డిపోలకు చేరవని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment