Monday, September 19, 2011

గాలి జనార్ధనరెడ్డి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్,సెప్టెంబర్ 19:  ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు నాంపల్లి న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. కస్టడీ ముగియటంతో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిని సీబీఐ పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. కాగా వీరిద్దర్ని మరో తొమ్మిదిరోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే  పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించటంతో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అధికారులు చంచలగూడ జైలుకు తరలించారు. కాగా, గాలి జనార్దనరెడ్డి తరపున ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...