గాలి జనార్ధనరెడ్డి రిమాండ్ పొడిగింపు

హైదరాబాద్,సెప్టెంబర్ 19:  ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు నాంపల్లి న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. కస్టడీ ముగియటంతో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిని సీబీఐ పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. కాగా వీరిద్దర్ని మరో తొమ్మిదిరోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే  పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించటంతో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అధికారులు చంచలగూడ జైలుకు తరలించారు. కాగా, గాలి జనార్దనరెడ్డి తరపున ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు