Sunday, September 18, 2011

తెలంగాణ ఒత్తిడి: ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

హైదరాబాద్,సెప్టెంబర్ 18: తెలంగాణవాదుల ఒత్తిడికి తలొగ్గి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు  వారు వేర్వేరుగా స్పీకర్ కార్యాయానికి రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు పంపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...