Saturday, September 17, 2011

నరేంద్ర మోడీ దీక్ష ప్రారంభం

అహ్మదాబాద్,సెప్టెంబర్ 17:   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సద్భావనా దీక్ష శనివారం ప్రారంభమైంది. శాంతి, సామరస్యం కోసం ఆయన మూడు రోజుల పాటు ఈ నిరశన దీక్షను కొనసాగించనున్నారు. గుజరాత్ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద మోడీ చేపట్టిన దీక్షకు మద్దతుగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ,అరుణ్ జైట్లీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఏఐడీఎంకే ప్రతినిధులు హాజరయ్యారు.
కాగా కాంగ్రెస్ కూడా పోటీగా దీక్షకు దిగింది. సబర్మతీ ఆశ్రమానికి ఎదురుగా కాంగ్రెస్ నేత,మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా దీక్ష ఆరంభించారు.  లోకాయుక్తకు భయపడే మోడీ దీక్ష చేపట్టారని వాఘేలా వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...