Wednesday, September 14, 2011

తీవ్రమవుతున్న సకల జనుల సమ్మె

హైదరాబాద్,సెప్టెంబర్ 14: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల  పిలుపు మేరకు సకల జనుల సమ్మె రెండు రోజులు పూర్తిచేసుకుంది.  సచివాలయం పై సమ్మె ప్రభావం పాక్షికంగా ఉండగా జిల్లాలలో తీవ్రం గానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా సుమారు 450 సినిమా హాళ్లు మూతపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వచ్చంధంగా 160 సినిమా హాళ్ళ లో ప్రదర్శనలు నిలిపివేశారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా నిరాహార దీక్షలు చేపట్టింది.   కరీం నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల లో  సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నందున బొగ్గు ఉత్పత్తికి తీవ్ర  అంతరాయం ఏర్పడింది.
 18  అర్ధరాత్రి నుంచి ఆర్టీసి సమ్మె
సకలజనుల సమ్మెలో భాగంగా ఆర్టీసి తెలంగాణ కార్మికులు ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. తెలంగాణ జిల్లాలలోని 89 డిపోలలో 60వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని తెలంగాణ ఎన్ఎంయు ఫోరం తెలిపింది. 
  ప్రభుత్వం హెచ్చరిక
తెలంగాణ ఉద్యోగులు వెంటనే సకల జనుల సమ్మెను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. సమ్మె వల్ల తెలంగాణలోని సామాన్య ప్రజలకే నష్టమని, సంక్షేమ పథకాలకు సైతం ఆటంకం కలుగుతోందని,  ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో హాజరు కాకుంటే చర్యలు తప్పవని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు.  ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ రాదన్నారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...