గ్యాస్ బండ ఇక గుదిబండే ...!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: గ్యాస్ బండ ఇక ప్రజల నెత్తిన గుదిబండే కానుంది. సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4 నుంచి 6కు పరిమితం చేయడంతోపాటు ఈ పరిమితి దాటాక ఒక్కో అదనపు సిలిండర్‌పై మార్కెట్ ధర ప్రకారం సుమారు 710 రూపాయలు వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఒకవేళ గ్యాస్ సబ్సిడీని ఏడాదికి నాలుగు నుంచి ఆరు సిలిండర్లకు పరిమితం చేస్తే వినియోగదారులు ఆ పరిమితి దాటాక సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం రూ. 710 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీపై ఇస్తున్న సిలిండర్లను పరిమిత సంఖ్యలో సరఫరా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ. 20,000 కోట్లు ఆదా అవుతుంది. సొంత ఇల్లు, కారు, ద్విచ క్రవాహనం, ఆదాయ పన్ను జాబితాలో పేరు కలిగి ఉన్న వారికి ఈ పరిమితి వర్తిస్తుందని అధికారి తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు