న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: గ్యాస్ బండ ఇక ప్రజల నెత్తిన గుదిబండే కానుంది. సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4 నుంచి 6కు పరిమితం చేయడంతోపాటు ఈ పరిమితి దాటాక ఒక్కో అదనపు సిలిండర్పై మార్కెట్ ధర ప్రకారం సుమారు 710 రూపాయలు వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఒకవేళ గ్యాస్ సబ్సిడీని ఏడాదికి నాలుగు నుంచి ఆరు సిలిండర్లకు పరిమితం చేస్తే వినియోగదారులు ఆ పరిమితి దాటాక సిలిండర్ను మార్కెట్ ధర ప్రకారం రూ. 710 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీపై ఇస్తున్న సిలిండర్లను పరిమిత సంఖ్యలో సరఫరా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ. 20,000 కోట్లు ఆదా అవుతుంది. సొంత ఇల్లు, కారు, ద్విచ క్రవాహనం, ఆదాయ పన్ను జాబితాలో పేరు కలిగి ఉన్న వారికి ఈ పరిమితి వర్తిస్తుందని అధికారి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment