Thursday, September 8, 2011

ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పురోగతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8:  ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హుజీ ఈ-మెయిల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని కిస్త్వర్ ప్రాంతం నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు గుర్తించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఓ సైబర్ కేఫ్ యజమాని కూడా ఉన్నాడు. కాగా ఢిల్లీ బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య 12 కి చేరింది. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తర్సెమ్ సింగ్ (34) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం గురువారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు.  ఇలాఉండగా ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై పార్లమెంట్ ఉభయసభలు గురువారం దద్దరిల్లాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబట్టింది. దాంతో ఇరు సభల్లోనూ కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...