చెన్నై,సెప్టెంబర్ 7: తమిళనాడు ప్రభుత్వ ఆస్థాన శిల్పి, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహ రూపశిల్పి డాక్టర్ వి. గణపతి స్థపతి (84) మంగళవారం ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గణపతి శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 6.05 గంటలకు కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ద్రవిడ దేవాలయ శిల్ప శాస్త్ర నిష్ణాతులైన గణపతి...శివగంగ జిల్లా పిళ్లయార్పట్టి గ్రామంలో 1927లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో...హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించి, అందుకు తగిన సమర్థుడు గణపతి స్థపతేనని ఆయన్ను రప్పించారు. కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తై తిరువళ్లువర్ విగ్ర హంతో పాటు అనేక శిల్పాలకు గణపతి రూపకల్పన చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment