హైదరాబాద్, సెప్టెంబర్ 5: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్రెడ్డిని సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఆయనతోపాటు ఓఎంసీ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గాలి జనార్థన్రెడ్డి అరెస్ట్ ను సీబీఐ జే డీ ధ్రువీకరించారు. ఆయన్ని ప్రశ్నించేందుకు హైదరాబాద్ తీసుకువస్తున్నారు. మాజీ మంత్రి గాలి జనార్థన్రెడ్డి అరెస్ట్ పై కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ్ వ్యాఖ్యానించటానికి నిరాకరించారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన అపరాధి అని చెప్పలేమన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్రెడ్డి అరెస్ట్ పై సమాధానం చెప్పాల్సింది తాను కాదని, బీజేపీనే అడగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు. '' గాలి జనార్థన్రెడ్డి వేరే పార్టీకి చెందిన వ్యక్తి. అతనికి సంబంధించి నన్ను ప్రశ్నించటం అనైతికం. ఇది మీడియాకు తగదు.... మీడియా ప్రతినిధులు విలువలు పాటించాలి. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చూడటం ఏ నైతికతకు నిదర్శనమని’'' ఆయన సూటిగా ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment