విజయవాడ,సెప్టెంబర్ 1 : అలనాటి ప్రముఖ నటి వాణిశ్రీ అక్కినేని నాగేశ్వరావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవదాసు చిత్రంలో సావిత్రి నటించక పోతే, ప్రేమ నగర్ లో నేను నటించకపోతే...అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత రామానాయుడు ఎక్కడ ఉండేవారని ఆమె ప్రశ్నించారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళా పీఠం విజయవాడలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన సావిత్రి కాంస్య విగ్రహాన్ని వాణిశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల్నే ఎవరూ గుర్తుంచుకోరని, అలాంటిది ఒక సినీ నటిని గుర్తు పెట్టుకుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చిత్ర పరిశ్రమ ప్రత్యేకత అన్నారు. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో పద్మశ్రీలు, పద్మ భూషణ్ అవార్డులను కొనుక్కుంటున్నారని, అలా కొనుక్కోక పోవడం వల్లనే సావిత్రి, ఎస్వీ రంగారావు లాంటి వారికి ఆ అవార్డులు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment