ఢిల్లీ పేలుడు మృతులు 9: దేశమంతా హైఎలర్ట్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7:  : ఢిల్లీలో హైకోర్టు సమీపంలో బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. హైకోర్టు గేటు నెంబర్.5 వద్ద ఈ జరిగిన ఈ పేలుడులో  తొమ్మిదిమంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. మరో 45మంది గాయపడినట్లు పేర్కొన్నారు. గాయపడినవారిలో ఎక్కువమంది న్యాయవాదులేనని తెలిపారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించటంతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు ఓ డబ్బాలో బాంబును అమర్చి కారులో ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసు బలగాలతో పాటు, బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా మూడు నెలల క్రితం హైకోర్టు సమీపంలో ఇదే తరహా పేలుడు సంభవించినా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మళ్లీ అదే తరహాలో పేలుడు జరగటం నిఘా వర్గాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాగా ఈ ఘటన తో హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు