Thursday, September 29, 2011

గాయత్రీదేవి గా కనకదుర్గమ్మ

శరన్నవరాత్రులలో గురువారం రెండవ రోజున

గాయత్రీ దేవి గా దర్శనమిచ్చిన బెజవాడ కనకదుర్గ 


విజయవాడ,సెప్టెంబర్ 29:  : దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ గురువారం రెండవ రోజున  గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  నవరాత్రుల్లో రెండోరోజు అమ్మవారు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.  శరన్నవరాత్రి ఉత్సవ్ల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...