గాలి జనార్ధన రెడ్డికి 19 వరకు రిమాండ్

హైదరాబాద్,సెప్టెంబర్ 5: : బిజెపి నేత, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) యజమాని గాలి జనార్ధన రెడ్డి, ఆ కంపెనీ సిఎండి శ్రీనివాసరెడ్డిలకు కోర్టు ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. వారిని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. 15 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. బుధవారం  లోపల పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు