Monday, September 5, 2011

గాలి జనార్ధన రెడ్డికి 19 వరకు రిమాండ్

హైదరాబాద్,సెప్టెంబర్ 5: : బిజెపి నేత, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) యజమాని గాలి జనార్ధన రెడ్డి, ఆ కంపెనీ సిఎండి శ్రీనివాసరెడ్డిలకు కోర్టు ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. వారిని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. 15 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. బుధవారం  లోపల పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...