విజయవాడ,సెప్టెంబర్ 26: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు దీక్షకు సిద్ధమయ్యారు. గత నెల రోజులకు పైగా కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ --తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంట విరామం ప్రకటించి ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా అక్టోబర్ 1వ తారీఖున తాను విజయవాడలో దీక్ష చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన సోదర, సోదరీమణుల కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయాల్లో కుళ్లు, కుతంత్రం లేకుండా విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఆయన కష్టపడి రెండోసారి అధికారంలోకి తెచ్చిన ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తనకు లేదన్నారు.గతంలో జగన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్సు మెంట్స్ ఇవ్వాలని హైదరాబాదులో ఫీజు పోరు, న్యూఢిల్లీలో జలదీక్ష, విజయవాడలో లక్ష్యదీక్ష తదితర దీక్షలు చేసిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment