హైదరాబాద్ ,అగస్ట్ 31: తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె వాయిదా పడినప్పటికి వరుసగా ఉద్యమ కార్యాచరణ రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 17వ తారీఖు నుండే సకల జనుల సమ్మె ప్రారంభించాలనుకున్నప్పటికీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు సమ్మెను విడతల వారీగా విభజిస్తూ సెప్టెంబర్ 6వ తేది నుండి ఉద్యోగులు సమ్మె ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు వినాయక చవితి రావడంతో మరోసారి జెఏసికి సమ్మె వాయిదా కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల సమ్మె వాయిదా పడినప్పటికీ వరుస కార్యక్రమాల రూపకల్పనకు జెఏసి పథక రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 6వ తారీఖుకు బదులు ఉద్యోగులు 13 నుండి సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా 8, 9, 10వ తేదీల్లో దశల వారిగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment