ముగ్గురు మాత్రం డుమ్మా...
హైదరాబాద్,అగస్ట్ 16: సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రి మండలి
సమావేశానికి తెలంగాణ మంత్రులు సారయ్య,శంకరరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మినహా మిగిలినవారందరూ హాజరయ్యారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సబిత, సునీత, డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన రెడ్డి తదితరులు హాజరయ్యారు. రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రివర్గ సమావేశానికి వెళ్లడం లేదని, తెలంగాణ మంత్రులు వెళ్లకూడదని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తన కన్ను సరిగా లేనందున మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని పి. శంకరరావు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. సారయ్య ఎందుకు హాజరు కాలేదనేది తెలియడం లేదు. తెలంగాణ మంత్రులను మంత్రివర్గ సమావేశానికి రప్పించడం ద్వారా ముఖ్యమంత్రి విజయం సాధించారని భావిస్తున్నారు. సచివాలయంలో కాకుండా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తే మంత్రి వర్గ సమావేశానికి వస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. ఆ మేరకు సిఎం క్యాంపు కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు.
హైదరాబాద్,అగస్ట్ 16: సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రి మండలి
సమావేశానికి తెలంగాణ మంత్రులు సారయ్య,శంకరరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మినహా మిగిలినవారందరూ హాజరయ్యారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సబిత, సునీత, డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన రెడ్డి తదితరులు హాజరయ్యారు. రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రివర్గ సమావేశానికి వెళ్లడం లేదని, తెలంగాణ మంత్రులు వెళ్లకూడదని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తన కన్ను సరిగా లేనందున మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని పి. శంకరరావు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. సారయ్య ఎందుకు హాజరు కాలేదనేది తెలియడం లేదు. తెలంగాణ మంత్రులను మంత్రివర్గ సమావేశానికి రప్పించడం ద్వారా ముఖ్యమంత్రి విజయం సాధించారని భావిస్తున్నారు. సచివాలయంలో కాకుండా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తే మంత్రి వర్గ సమావేశానికి వస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. ఆ మేరకు సిఎం క్యాంపు కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు.
No comments:
Post a Comment