న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో శిల్పాషెట్టి సినిమా

వాషింగ్టన్అగస్ట్ 18:   బాలీవుడ్ నటి శిల్పాషెట్టి తొలిసారిగా ఇంగ్లీషులో నటించిన ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శనకు ఎంపికయింది. దోస్తానా హిందీ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన శిల్పాషెట్టి ఈ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆర్. శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైనా స్టార్ జియా యూ సరసన ఆమె నటించింది. సన్యాసినిగా మారిన నృత్యకారిణి పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమాను ఈ నెల 22, 24 తేదీల్లో న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారని శిల్పాషెట్టి ట్విట్టర్‌లో పేర్కొంది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు