వాషింగ్టన్,అగస్ట్ 18: అమెరికా చదువులపై భారతీయ విద్యార్థులకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువు కోసం అమెరికా వచ్చేందుకు ఇండియా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నట్టు తాజాగా వెలువడిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయిలో అడ్మిషన్ల కోసం ఈ ఏడాది పేర్లు నమోదు చేస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 8 శాతం పెరిగింది. 2006 తర్వాత ఇదే అత్యధిక శాతమని కౌన్సిల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ స్కూల్స్ (సీజీఎస్) తాజా సర్వే నివేదికలో పేర్కొంది. గతేడాది కేవలం 3 శాతం మెరుగుదల మాత్రమే కన్పించింది.2010-11 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో 11 శాతం పెరుగుదల నమోదయింది. 23 శాతం వృద్ధితో చైనా అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఆరో ఏడాది చైనా రెండంకెల వృద్ధి సాధించిందని సీజీఎస్ వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment