రాజీనామాలపై నిపుణుల సలహా: స్పీకర్
న్యూఢిల్లీ,జులై 10: ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు సమర్పించిన రాజీనామాలపై తక్షణం ఎలాంటి నిర్ణయం ఉండబోదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిపుణులతో సంప్రదించి సలహా తీసుకోవడంతో పాటు రాజీనామా చేసిన సభ్యులందరితోనూ వేర్వేరుగా సంప్రదింపులు జరిపి తదనుగుణ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్ వెళ్ళక రాజీనామా లేఖలు పరిశీలించిన తర్వాత తప్ప, తానీ విషయంలో ఏమీ మాట్లాడలేనని అన్నారు. అమెరికా నుంచి ఆదివారం ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న నాదెండ్ల- రాజధానిలో జరుగుతున్న సార్క్ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొన్నారు. ఆయన 13న హైదరాబాద్ చేరుకుంటారు.
Comments