Monday, July 4, 2011

ఆరో జోన్‌లో హైదరాబాదు...?

న్యూఢిల్లీ,జులై 4‌: ప్రధాని మన్మోహన్ సింగ్‌తో రాజకీయ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. తెలంగాణ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశ  వివరాలు తెలియనప్పటికీ  హైదరాబాదును ఆరో జోన్‌లో భాగం చేయడానికి వీలుగా 14ఎఫ్ నిబంధనను తొలగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.  అయితే,  దీనిపై తిరిగి తీర్మానం చేసి పంపాలని శానససభను కోరుతూ ఓ మెలిక పెట్టడం గమనార్హం.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, వీరప్ప మొయిలీ, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, దయానిధి మారన్ పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన 9 మంది లోకసభ సభ్యులు రాజీనామా చేయడం వల్ల యుపిఎ ప్రభుత్వానికి ముప్పేమీ లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. చిన్న రాష్ట్రాలకు కాంగ్రెసు వ్యతిరేకం కాదని సంప్రదింపులు, చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. రాజీనామాలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందా, రాదా అనేది క్రమశిక్షణా సంఘం చూసుకుంటుందని ఆయన చెప్పారు. రాజీనామాల వల్ల రాజ్యాంగ సంక్షోభం లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...