రగులుతున్న సీమాంధ్ర

హైదరాబాద్,జులై 11:  సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాష్టాన్ని సమైక్యంగా  ఉంచుతామని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఆంధ్ర, ఎస్వీ, పద్మావతి, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళనలకు దిగుతున్నారు. సోమవారంనాటికి  ఆందోళనలు ఉధృతమయ్యాయి. మంత్రులు, రాజకీయ నాయకుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి వచ్చిన నేతలను అడ్డుకుంటున్నారు. తాజాగా, మంత్రి రఘువీరారెడ్డిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు